రాముడు అవతారపురుషుడైనప్పటికీ మానవుడిలాగ ప్రవర్తించి,మానవుడు ఎలా ఆదర్శపురుషుడుగా జీవించగలడన్నది ఆచరించి చూపించాడు. తాను అలా జీవించి మనకారాధ్యుడయ్యాడు. ఇంక ఆయన సీతాదేవిని ఎందుకు త్యజించాల్సివచ్చిందో గూడా తెలుసుకోవాలి. సీతారాములు చాలాకాలం జీవించారు. దాదాపు 11వేల సం॥లని రామాయణంలో ఉంది. దేవతల ప్రార్థన వల్ల వారికి అవతార సమాప్తి చేయాల్సిన సమయం వచ్చింది. అందువల్ల ముందుగా ఓ అపవాదుని సృష్టించి సీతను త్యజించాడు. ఆ విషయాన్ని గూర్చి సీతతో సమాలోచన చేసాడు ముందుగా. ఆవిడ గర్భవతని తెలుసు. అందుకే ఋష్యాశ్రమానికి పంపించాడు. ఆవిడ అక్కడే పిల్లల్నికని రాచరికపు వాతావరణంలో కాకుండా, ఋష్యాశ్రమ వాతావరణంలో పిల్లల్ని పెంచగలదని తెలిసే చేసాడు. ఇది రామాయణం చదివిన వారికి తెలుస్తుంది. సీత భూప్రవేశం చేసాక, తాను గూడా వెళ్ళిపోయాడు వైకుంఠానికి.